కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం- నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్
The bullet news ( Nellore ) _ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషను ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నారు..ఇవాళ మీకోసం - మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండు కూడలిలో ఏర్పాటు చేసిన మజ్జిగ, అంబలి, మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయరు మాట్లాడుతూ తోటి వారికి సేవ చేయాలన్న సేవా దృక్పథంతో మీకోసం- మేము ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.. వీరి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని నగరంలోని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వారితో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాల నిర్వాహకులూ, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయ సిబ్బంది తమ ప్రాంగణాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలని మేయరు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేసే ప్రధాన కూడళ్లలో కార్పొరేషను ఆధ్వర్యంలో త్వరలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహణా బాధ్యతలను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని మేయరు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సునీల్, సుమలతా హరి, కార్తీక్, వెంకట రమణ, భార్గవ్, సుజన, కిషోర్, రవి, సాయి, సురేంద్ర, షాజీర్, టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నే సాహెబ్, నాయకులు మునవర్, మౌలానా తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం- నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్
Reviewed by ADMIN
on
March 25, 2018
Rating:
No comments: