నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ప్రధాని మోడీ
The bullet news (Nellore)- ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ నెల్లూరులో టీడీపీ మహిళా నేతలు వినూత్న రీతిలో తమ నిరసను వ్యక్తం చేశారు.. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ లో మోడీ వేషదారణలోని ఓ వ్యక్తికి వినతిపత్రం అందజేశారు.. మోడి నిరంకుశత్వం నిరసించాలని, ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.. టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు తాళ్లపాక అనురాద మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేకహోదా ఇస్తానని మాటిచ్చిన మోడి ఆ మాట నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.. ప్రధానిమీద గౌరవంతో ఈ నాలుగేళ్లు ముఖ్యమంత్రి హోదాపై మాట్లాడలేదన్నారు.. అరుణ్ జైట్లీ ప్రసంగం విన్న తర్వాత హోదాపై తమ నిరసనను ఉద్రుతం చేస్తున్నామన్నారు.. హోదా ఇచ్చే వరకు టీడీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు..
నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ప్రధాని మోడీ
Reviewed by ADMIN
on
March 30, 2018
Rating:
No comments: