'గబ్బర్ సింగ్' రెస్టారెంటులో బాద్షా..!!
The bullet news ( Nellore)_
గబ్బర్ సింగ్ రెస్టారెంట్ లో బాద్షా మెరిశాడు.. తన అనుచరులతో కలిసి పసందైన రుచులను ఆరగించారు.. వంటకాలను మెచ్చుకున్న ఆయన వినియోగదారులకు నెల్లూరు రుచులను అందించాలన్నారు.. ఇంతకీ..? గబ్బర్ సింగ్ రెస్టారెంట్ ఏంటి..? బాద్షా ఎవరు అనుకుంటున్నారా..? వాచ్ డిస్ న్యూస్..
వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నగరంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడాన్ని బాధ్యతగా భావించాలని మేయరు అబ్దుల్ అజీజ్ కోరారు. స్థానిక డైకాసు రోడ్డు కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'గబ్బర్ సింగ్' ఫ్యామిలీ రెస్టారెంటును మేయరు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రసిద్ధి చెందిన రాజ రాజేశ్వరి ట్రావెల్స్ కంపెనీ నిర్వాహకులు నెల్లూరు ప్రజలకు సరికొత్త మాంసాహారపు రుచుల ఆస్వాదాన్ని అందించాలన్న ఆలోచనలతో హోటల్ రంగంలోకి ప్రవేశించి నూతనంగా రెస్టారెంటును ప్రారంభించారని వెల్లడించారు. నగరవ్యాప్తంగా యాజమాన్యం నిర్వహిస్తున్న వివిధ రంగాల పరిశ్రమలతో సుమారు 50 కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయని మేయరు సంతోషం వ్యక్తంచేశారు. సౌకర్యవంతమైన డైనింగ్ విభాగాలతో అత్యంత శ్రేష్టమైన హైదరాబాదు బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు వంటి అన్ని రకాల మాంసాహార వంటకాల్లో ఉన్నత స్థాయి విలువలు పాటిస్తూ విచ్చేసే వినియోగదారులచే గబ్బర్ సింగ్ రెస్టారెంటు ప్రత్యేక గుర్తింపు పొందుతుందని మేయరు ఆకాంక్షించారు. కార్యక్రమంలో రెస్టారెంటు నిర్వాహకులు వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు నన్నేసాహేబ్, రాజానాయుడు, పెంచల నాయుడు, జాకీర్, షంషుద్దీన్, సాబీర్ ఖాన్, సుభహాన్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
గబ్బర్ సింగ్ రెస్టారెంట్ లో బాద్షా మెరిశాడు.. తన అనుచరులతో కలిసి పసందైన రుచులను ఆరగించారు.. వంటకాలను మెచ్చుకున్న ఆయన వినియోగదారులకు నెల్లూరు రుచులను అందించాలన్నారు.. ఇంతకీ..? గబ్బర్ సింగ్ రెస్టారెంట్ ఏంటి..? బాద్షా ఎవరు అనుకుంటున్నారా..? వాచ్ డిస్ న్యూస్..
వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నగరంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడాన్ని బాధ్యతగా భావించాలని మేయరు అబ్దుల్ అజీజ్ కోరారు. స్థానిక డైకాసు రోడ్డు కూడలిలో నూతనంగా ఏర్పాటు చేసిన 'గబ్బర్ సింగ్' ఫ్యామిలీ రెస్టారెంటును మేయరు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రసిద్ధి చెందిన రాజ రాజేశ్వరి ట్రావెల్స్ కంపెనీ నిర్వాహకులు నెల్లూరు ప్రజలకు సరికొత్త మాంసాహారపు రుచుల ఆస్వాదాన్ని అందించాలన్న ఆలోచనలతో హోటల్ రంగంలోకి ప్రవేశించి నూతనంగా రెస్టారెంటును ప్రారంభించారని వెల్లడించారు. నగరవ్యాప్తంగా యాజమాన్యం నిర్వహిస్తున్న వివిధ రంగాల పరిశ్రమలతో సుమారు 50 కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయని మేయరు సంతోషం వ్యక్తంచేశారు. సౌకర్యవంతమైన డైనింగ్ విభాగాలతో అత్యంత శ్రేష్టమైన హైదరాబాదు బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు వంటి అన్ని రకాల మాంసాహార వంటకాల్లో ఉన్నత స్థాయి విలువలు పాటిస్తూ విచ్చేసే వినియోగదారులచే గబ్బర్ సింగ్ రెస్టారెంటు ప్రత్యేక గుర్తింపు పొందుతుందని మేయరు ఆకాంక్షించారు. కార్యక్రమంలో రెస్టారెంటు నిర్వాహకులు వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు నన్నేసాహేబ్, రాజానాయుడు, పెంచల నాయుడు, జాకీర్, షంషుద్దీన్, సాబీర్ ఖాన్, సుభహాన్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
'గబ్బర్ సింగ్' రెస్టారెంటులో బాద్షా..!!
Reviewed by ADMIN
on
March 30, 2018
Rating:
No comments: