Top Ad unit 728 × 90

"సింహపురి"లో విజయవంతంగా మరో అవయవదానం.

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు సింహపురి హాస్పిటల్స్ లో విజయవంతంగా మరో అవయవ దానం జరిగింది.
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వాకాడు మండలం జాండ్రపేట కు చెందిన రాయపు శ్రీనివాసులుకు బ్రెయిన్ డెడ్ అయింది.. దింతో అతనికి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.. సింహపురి హాస్పిటల్స్ ఆడిటోరియం లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు. హాస్పిటల్స్ చైర్మన్ కాటంరెడ్డి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ రాయపు శ్రీనివాసులు ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం సాగిస్తుంటాడని, అతడు మోటార్ బైక్ పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైనపుడు బుధవారం ఉదయం సింహపురి హాస్పిటల్స్ కు తీసుకు రావడం జరిగిందన్నారు. వెంటనే అవసరమైన పరీక్షలు జరిపి వెనువెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారన్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను న్యూరో సర్జన్ డా.వెంకటేశ్వర ప్రసన్న, డా.సతీష్ వందనపు లతో కూడిన బృందం చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం సాయంత్రం న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్ డా.దీక్షాఇంతి నారాయణ్, ఇంటెన్సివిస్ట్ డా.నరేష్ లతో కూడిన బృందం బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారన్నారు. అప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు వారు అవయవ దానానికి అంగీకరించారన్నారు. కుటుంబ సభ్యుని కోల్పోతూ కూడా మంచి మనసుతో వారు ఈ దానానికి అంగీకరించినందుకు వారి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మెడికల్ డైరెక్టర్ డా.పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించగానే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అత్యంత పారదర్శకంగా పనిచేసే ప్రభుత్వ సంస్థ ఐన జీవన్ దాన్ కు సమాచారం అందించి, వారి సూచనల మేరకు శ్రీనివాసులు కు చెందిన రెండు కళ్ళను నెల్లూరు మోడరన్ ఐ హాస్పిటల్ కు, ఒక కిడ్నీని సింహపురి హాస్పిటల్స్ కు, మరొక కిడ్నీ ని తిరుపతి కి చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ కు, గుండెను చెన్నై గ్లోబల్ హాస్పిటల్స్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం గా పూర్తి కావడానికి అహర్నిశలు కృషి చేసిన సింహపురి హాస్పిటల్స్ వైద్య బృందం న్యూరో సర్జన్ డా.వెంకటేశ్వర ప్రసన్న, డా.సతీష్ వందనపు, ఇంటెన్సివిస్ట్ డా.నరేష్, యూరాలజిస్టులు డా.లక్ష్మి రమేష్, డా.భార్గవ్, కిడ్నీ వైద్య విభాగం వైద్యులు ఎంతైనా అభినందనీయులని ప్రశంసించారు. ఈ అవయవ దానానికి సహకరించిన రాయపు శ్రీనివాసులు కుటుంబ సభ్యులను అభినందించారు.
ఈ సమావేశంలో న్యూరో సైకియాట్రిస్ట్ డా.సాగర్, హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.
"సింహపురి"లో విజయవంతంగా మరో అవయవదానం. Reviewed by ADMIN on March 30, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.