రామయ్యా.. రైతులను చల్లగా చూడయ్యా... - మంత్రి అమర్నాధ్ రెడ్డి
THE BULLET NEWS (PALAMANERU)-వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండి రైతులతో పాటు అన్ని రంగాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మంత్రివర్యులు అమరనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. పలమనేరు మండలంలోని కొలమాసనపల్లె పంచాయతీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆయన సతీమణి రేణుకారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిలాగే ఈ ఏడాది సైతం వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంతో ఉండేలా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కోశాధికారి ఆర్వీ సుభాష్ చంద్రబోస్ జిల్లా కోసం అధికారి ఆర్వి బాలాజీ పలమనేరు, బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు జగదీష్ నాయుడు కిషోర్ గౌడ టిడిపి జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ నాయుడు, పలమనేరు జడ్పీటిసి శమంతకమణి మరియు గ్రామస్తులు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
రామయ్యా.. రైతులను చల్లగా చూడయ్యా... - మంత్రి అమర్నాధ్ రెడ్డి
Reviewed by ADMIN
on
March 26, 2018
Rating:
No comments: