మూర్చవ్యాధిపై అవగాహన అవసరం - సింహపురి హాస్పిటల్లో "పర్పుల్ డే"
THE BULLET NEWS (NELLORE)-ప్రపంచ మూర్చవ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని సింహపురి హాస్పిటల్లో "పర్పుల్ డే" జరిగింది. అంతర్జాతీయంగా మూర్చవ్యాధి అవగాహన దినోత్సవాన్ని "పర్పుల్ డే" గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నెల్లూరు సింహపురి హాస్పిటల్లో జరిగిన పర్పుల్ డే లో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ దీక్షాంతి నారాయణ్ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర ప్రసన్న, సైకియాట్రిస్ట్ డాక్టర్ సాగర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహపురి న్యూరాలజిస్ట్ డాక్టర్ దీక్షాంతి నారాయణ మాట్లాడుతూ మూర్చవ్యాధిపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయని తెలిపారు. మూర్చవ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. మెదడులో మచ్చలు ఉండటం, మెదడులో రక్తనాళాలు బ్లాక్ కావడం, కణితులు ఉండటం, మెదడువాపు వ్యాధి ఉన్నటువంటి వారికి తరుచుగా మూర్చవ్యాధి వస్తుందని తెలిపారు. మనోవికారం, అధిక జ్వరం ఉండటం వంటివి కూడా మూర్చవ్యాధికి కారణాలుగా ఉంటాయని తెలిపారు. చాలా మంది జన్యపరంగా మూర్చ వ్యాధి వస్తుందని నమ్ముతారని, ఇది అతికొద్ది కేసుల్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 2015 నాటికి సుమారు 39 మిలియన్ల మంది మూర్చవ్యాధితో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయని అన్నారు. మూర్చవ్యాధి వచ్చినప్పుడు, వారి చేతుల్లో ఇనుప తాళాలు, రాడ్లు వంటివి ఉంచుతారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు.మూర్చవ్యాధితో బాధపడేవారు తరచుగా వైద్యులసలహాలు సూచనలు పాటించడంతోపాటూ, వ్యాధి వచ్చిన వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్కు తీసుకుని వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా మూర్చవ్యాధి రోగులు తమ జేబులో తనకు ఉన్న వ్యాధి గురించి తెలియజేస్తూ, ఫోన్ నెంబర్ను ఉంచుకోవాలని తెలిపారు. చాలా వరకు మూర్చవ్యాధిని మందులతోనే నయం చేసుకోవచ్చని చెప్పారు. మూర్చవ్యాధిపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించేందుకు "పర్పుల్ డే" నిర్వహిస్తున్నామని అన్నారు.
సింహపురిలో 50శాతం డిస్కౌంట్తో పరీక్షలు:
నెల్లూరులోని సింహపురి హాస్పిటల్లో "పర్పుల్ డే" సందర్భంగా వారం రోజులపాటు మూర్చవ్యాధికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు న్యూరో సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర ప్రసన్న వెల్లడించారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం డిజిటల్ తెరపై ప్రజలకు మూర్చవ్యాధి రావడానికి గల కారణాలు, వాటి లక్షణాలు, నివారణ పద్దతులపై సవివరింగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింహపురిలో 50శాతం డిస్కౌంట్తో పరీక్షలు:
నెల్లూరులోని సింహపురి హాస్పిటల్లో "పర్పుల్ డే" సందర్భంగా వారం రోజులపాటు మూర్చవ్యాధికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు న్యూరో సర్జన్ డాక్టర్ వెంకటేశ్వర ప్రసన్న వెల్లడించారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం డిజిటల్ తెరపై ప్రజలకు మూర్చవ్యాధి రావడానికి గల కారణాలు, వాటి లక్షణాలు, నివారణ పద్దతులపై సవివరింగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మూర్చవ్యాధిపై అవగాహన అవసరం - సింహపురి హాస్పిటల్లో "పర్పుల్ డే"
Reviewed by ADMIN
on
March 26, 2018
Rating:
No comments: