సోమిరెడ్డి.. మమ్మల్ని నిండా ముంచావయ్యా..- పొదలకూరు రైతుల మండిపాటు..
The bullet news ( Podalakuru)_ వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్ల తాము పూర్తి స్థాయిలో నష్టపోయామని పొదలకూరు మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రైతులు మంత్రి సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్రామాలకు సాగునీరు ఆపివేస్తే తామంతా సోమిరెడ్డి వద్దకు వెళ్తామని.. తాను రాజకీయంగా లబ్ది పొందొచ్చని ఆయన ఆలోచన చేశారని. పంటలు సాగుచేయడమైనా ఆపేస్తాం తప్ప సోమిరెడ్డి మొఖం చూడబోమని రైతులు మండిపడ్డారు.. రైతులను రౌడీలుగా సంబోధించిన ఏకైక నాయకుడు సోమిరెడ్డేనన్నారు. పొదలకూరు మండలంలో అనేక గ్రామాలలో స్వంత నిధులతో కాలువలు తవ్వించిన ఘనత ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డేదన్నారు. ఆయనిచ్చిన భరోసాతోనేపొదలకూరు మండలంలో పంటలు వేసుకున్నామన్నారు. సెంటు పొలం ఎండినా తన స్వంత నిధులతోనే నష్ట పరిహారం చెల్లిస్తానని, పంటలు నిర్భయంగా వేసుకోమని ఎమ్మెల్యే కాకాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే పంటలు వేశామన్నారు.. ఎంతో గొప్ప నాయకులను, గొప్ప మంత్రులను చూసిన పొదలకూరు మండలం సోమిరెడ్డి లాంటి కుళ్లు, కుతంత్రాలు కల్గిన మంత్రిని చూడటం ఇదే మొదటిసారన్నారు. సోమిరెడ్డి లాంటి అవినీతి పరులను పొదలకూరు ప్రాంత ప్రజలు ఎన్నటికీ ఆదరించరని వెల్లడించారు. అధికారం లేకపోయినా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి శాసన సభ్యుడుగా ఉండడం వల్లే తాము గుండెమీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా సోమిరెడ్డి రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించాలన్నారు..
సోమిరెడ్డి.. మమ్మల్ని నిండా ముంచావయ్యా..- పొదలకూరు రైతుల మండిపాటు..
Reviewed by ADMIN
on
March 26, 2018
Rating:
No comments: