క్రీస్తు చూపిన మార్గం ఆదర్శనీయం - రన్ ఫర్ జీసస్ ర్యాలీలో మేయరు
The bullet news ( Nellore) _ విశ్వశాంతి స్థాపనకు ఏసుక్రీస్తు చూపిన శాంతి మార్గం అత్యంత ఆదర్శనీయమనీ, నగరంలోని క్రైస్తవ సోదరులు ఐక్యంగా చేస్తున్న సామజిక కార్యక్రమాలు అభినందనీయమని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. యేసు క్రీస్తు పునరుజ్జీవన దినాన్ని పురస్కరించుకుని ఆరాధన టివి, నెల్లూరు పాస్టర్స్ ఫెలోషిప్ ల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక ఏబీఎం కాంపౌండు నుంచి ప్రారంభమై, బట్వాడీపాలెం కూడలి వరకు సాగిన ర్యాలీలో మేయరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల ప్రాముఖ్యతను లోకానికి చాటేందుకూ, యువతను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేందుకూ, క్రైస్తవ సంఘాల ఐక్యతను పెంచేందుకు ప్రతి ఏటా రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. అత్యున్నత భారత రాజ్యాంగం అందించిన మత స్వేచ్ఛను కాపాడుకుంటూ యేసు చూపిన ఉత్తమమైన జీవన విధానాన్ని క్రైస్తవ సోదరులందరూ పాటించాలని మేయరు కోరారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో రెవరెండ్ డేవిడ్ దయాసాగర్, బ్రదర్లు సురేంద్రబాబు, బర్నబాస్, జానీజో, అన్ని క్రైస్తవ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
క్రీస్తు చూపిన మార్గం ఆదర్శనీయం - రన్ ఫర్ జీసస్ ర్యాలీలో మేయరు
Reviewed by ADMIN
on
March 31, 2018
Rating:
No comments: