ఎమ్మెల్సీ యలమంచిలి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల
- THE BULLETBNEWS (VUYYUR)-తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాం.. ఆర్దికంగా ఆదుకోండయ్యా అంటూ ఏ నిరుపేద కుటుంబం ఆయన దగ్గరికి వెళ్లినా.. లేదనకుండా ఆర్దికసాయం చేస్తారు.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మరింత ఆర్దిక సాయం అందేలా చూస్తారు.. నిదులు మంజూరు అయ్యేదాకా సీఎంవో కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూనే ఉంటారు.. ఆయన చొరవతోనే ఉయ్యూరు నియోజకవర్గంలో పదుల నిరుపేదల కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రాణాలు దక్కించుకున్నారు.. చిన ఓగిరాలకు చెందిన పాలడుగు సత్యనారాయణ అనే రైతు తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్ లో చేరాడు.. దాదాపు 16లక్షల దాకా ఖర్చు పెట్టినా వైద్యం కోసం మరో 10లక్షలు కావాల్సి వచ్చింది.. దీంతో స్పందించిన ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 8లక్షల మంజూరు చేయించారు.. ఇవాళ రైతు కుటుంబ సభ్యులకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో సిద్దార్ద అకాడమి సెక్రటరీ పాలడుగు లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ వినయ్ కుమార్ , మండలాధ్యక్షులు శ్రీనివాసరావు, ఎఎంసీ చైర్మన్ కలాం, తదితరులు పాల్గొన్నారు..
ఎమ్మెల్సీ యలమంచిలి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల
Reviewed by ADMIN
on
March 25, 2018
Rating:
No comments: