సీఎం తాపత్రయం దాని కోసమే.. - మంత్రి సోమిరెడ్డి కామెంట్..
THE BULLET NEWS (KADAPA)-బిజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా తెలుగు ప్రజల పై పెత్తనం చేయాలని చూస్తే ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు నేరుగా రాష్ట ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్దమన్నారు.. వైసీపీతో కలిసి కావాలనే టీడీపీపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు.. చంద్రబాబు నాయుడి తాపత్రయం రాష్ట ప్రజల సంక్షేమం కోసమైతే.. ప్రతిపక్ష నాయకుడు కేసుల నుంచి బయటపడటానికి తాపత్రయ పడుతున్నారని విమర్శించారు.. రాష్ట ప్రజలను అవమానపరుస్తున్న బిజేపీతో వైసీపీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ చేస్తున్న గలీజ్ రాజకీయాలను రాష్ట ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన బుద్ది చెబుతారని ఆయన వెల్లడించారు..
సీఎం తాపత్రయం దాని కోసమే.. - మంత్రి సోమిరెడ్డి కామెంట్..
Reviewed by ADMIN
on
March 25, 2018
Rating:
No comments: