గన్నవరంలో లారీ-కారు ఢీ.. ఒకరు మృతి
THE BULLET NEWS (GANAVARAM)-కృష్ణాజిల్లా గన్నవరం జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటన ఒకరు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.. గన్నవరం జాతీయ రహదారి పై ఏలూరు వెళ్లేందుకు సిద్దమవుతున్న ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు డీ కొట్టింది.. దీంతో ఒకరు అక్కడిక్కడే మృతిచెందారు. మృతుడు హైదరాబాద్ కు చెందిన అన్నెపాగ పవన్ కుమార్(25) గా పోలీసులు గుర్తించారు.. పవన్ కుమార్ ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. గాయాలపాలైన బిజ్జా వినయ్ కుమార్ బీటెక్, పాలిశెట్టి సాయి కుమార్ జాబ్ చేస్తున్నట్లు సమాచారం.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గన్నవరంలో లారీ-కారు ఢీ.. ఒకరు మృతి
Reviewed by ADMIN
on
April 02, 2018
Rating:
No comments: