జనసేనుడి పోరుబాటకు పోటెత్తిన జనసముద్రం...
THE BULLET NEWS (VIJAYAWADA)-ఏపీ ప్రత్యేక హోదా కోసం ఈ పాదయాత్ర తొలి అడుగుమాత్రమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపి విభజన హామీలను కేంద్రం నెరవేర్చనందుకు నిరసనగా జాతీయ రహదారులపై వామపక్ష నేతలతో కలిసి చేపట్టిన పాదయాత్రలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పవన్ కళ్యాణ్ నివాళులర్పించి పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగాఆ యన మాట్లాడుతు.. రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని దానికి ఇది తొలి అడుగు మాత్రమేనని పవన్ తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు ఆస్తులు ఇచ్చి ఏపీకి మాత్రం అప్పులు ఇచ్చిందన్నారు. 


జనసేనుడి పోరుబాటకు పోటెత్తిన జనసముద్రం...
Reviewed by ADMIN
on
April 06, 2018
Rating:
No comments: