పెన్షన్ కోసం తల్లి శవాన్ని రెండేళ్లు దాచాడు...
THE BULLET NEWS (KOLKATA)-మరణాన్ని కూడా క్యాష్ చేసుకోవాలని భావించాడు ఒక ప్రబుధ్ధుడు. తల్లి మరణాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఆమె శవంతో లక్షాధికారి కావాలనుకున్నాడు. వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలో జరిగిన ఓ దారుణ సంఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది.
కోల్కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన బీనా మజుందార్ FCI రిటైర్డ్ ఉద్యోగిని. ఆమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం బీనా మజుందార్ చనిపోయింది. అయితే ఆమె కొడుకు సువవ్రతా తల్లి మరణాన్ని క్యాష్ చేసుకోవాలని భావించాడు. తల్లికి అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. మృతదేహం పాడవకుండా రసాయనాలు ఉపయోగించాడు.
స్థానికులకు తండ్రి, కొడుకుల ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సువవ్రతా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఓ డీప్ ఫ్రీజర్ ను గుర్తించిన పోలీసులు దాన్ని తెరిచి చూడగా బీనా మృతదేహం కన్పించింది. ఫోర్జరీ చేసిన కొన్ని పేపర్లను స్వాధీనం చేసుకొన్నారు. రిటైర్ అయిన తర్వాత బీనాకు నెలకు రూ. 50వేల పింఛను వచ్చేది. అయితే బీనా చనిపోయినప్పటి నుంచి ఆమె వేలి ముద్రలు తీసుకుంటూ రెండేళ్లుగా సువవ్రతా ఆ పింఛను తీసుకున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బీనా మృతదేహాన్ని భద్రపరిచిన విషయం తనకు తెలుసునని, కొడుకు సూచనల మేరకే తాను ఈ విషయం పోలీసులకు చెప్పలేదని గోపాల్ విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
కోల్కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన బీనా మజుందార్ FCI రిటైర్డ్ ఉద్యోగిని. ఆమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రితం బీనా మజుందార్ చనిపోయింది. అయితే ఆమె కొడుకు సువవ్రతా తల్లి మరణాన్ని క్యాష్ చేసుకోవాలని భావించాడు. తల్లికి అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచిపెట్టాడు. మృతదేహం పాడవకుండా రసాయనాలు ఉపయోగించాడు.
స్థానికులకు తండ్రి, కొడుకుల ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సువవ్రతా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఓ డీప్ ఫ్రీజర్ ను గుర్తించిన పోలీసులు దాన్ని తెరిచి చూడగా బీనా మృతదేహం కన్పించింది. ఫోర్జరీ చేసిన కొన్ని పేపర్లను స్వాధీనం చేసుకొన్నారు. రిటైర్ అయిన తర్వాత బీనాకు నెలకు రూ. 50వేల పింఛను వచ్చేది. అయితే బీనా చనిపోయినప్పటి నుంచి ఆమె వేలి ముద్రలు తీసుకుంటూ రెండేళ్లుగా సువవ్రతా ఆ పింఛను తీసుకున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బీనా మృతదేహాన్ని భద్రపరిచిన విషయం తనకు తెలుసునని, కొడుకు సూచనల మేరకే తాను ఈ విషయం పోలీసులకు చెప్పలేదని గోపాల్ విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
పెన్షన్ కోసం తల్లి శవాన్ని రెండేళ్లు దాచాడు...
Reviewed by ADMIN
on
April 05, 2018
Rating:
No comments: