భారత్ లో మరో బ్యాంకు కుంభకోణం...
THE BULLET NEWS (GUJARAT)-దేశంలో మరో బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. బ్యాంకుల్ని ముంచిన కార్పొరేట్ల లిస్టులో మరో సంస్థ చేరింది. గుజరాత్కు చెందిన డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DPIL).. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా,ICICI తో పాటు 11 బ్యాంకులను రూ.2 వేల 654 కోట్ల మోసం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ CBI కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వడోదర కేంద్రంగా నడుస్తున్న DPIL, దాని డైరెక్టర్లపై క్రిమినల్ కేసును దాఖలు చేసినట్లు గురువారం(ఏప్రిల్-5) సీబీఐ తెలియజేసింది. ఆ సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలను కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, ఎక్విప్మెంట్ తయారీదారైన డీపీఐఎల్.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 11 బ్యాంకుల నుంచి మోసం చేసి రుణాలు పొందింది. 2008 నుంచి ఈ వ్యవహారం జరుగగా, 2016 జూన్ 29 వరకు రుణ బకాయిలు రూ.2,654.40 కోట్లకు చేరాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని నిరర్థక ఆస్తిగా బ్యాంకుల కూటమి ప్రకటించింది. ఎస్ఎన్ భట్నాగర్, ఆయన కుమారులు అమిత్ భట్నాగర్, సుమిత్ భట్నాగర్ ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీ వాస్తవాలను దాచిపెట్టి టర్మ్ లోన్లు, ఇతరత్రా రుణాలు పొందినట్లు సీబీఐ తెలిపింది. తప్పుడు ప్రకటనలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)) రుణ ఎగవేతదారుల జాబితాలో వీరి పేర్లున్నాయని, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ECGC) కూడా వీరితో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నదని వివరించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)) రుణ ఎగవేతదారుల జాబితాలో వీరి పేర్లున్నాయని, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ECGC) కూడా వీరితో జాగ్రత్త అని హెచ్చరిస్తున్నదని వివరించింది.
భారత్ లో మరో బ్యాంకు కుంభకోణం...
Reviewed by ADMIN
on
April 06, 2018
Rating:
No comments: