జగన్ నాయకత్వం రాష్టానికి అవసరం- ఎమ్మెల్యే కాకాణి
The bullet news (Nellore)- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతగానితనం, అసమర్దతే ఏపీకి శాపంగా మారిందని వైసీపీ నెల్లూరుజిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు.. నెల్లూరులో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాయుడి విదేశీ టూర్ల పుణ్యమా అంటూ 96వేల కోట్లున్న రాష్ట అప్పులు.. ఒక్కసారిగా 2.3వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు.. రాష్టానికి జగన్ నాయకత్వం అవసరమన్న కాకాణి.. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలొమీటర్లకు చేరుకుంటున్న సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రెండు రోజులపాటు పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు.. చివరి రోజు వంచనపై గర్జన పేరుతో కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు..
జగన్ నాయకత్వం రాష్టానికి అవసరం- ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
May 13, 2018
Rating:
No comments: