వైఎస్సార్ కుటుంబానికి అనూహ్య స్పందన- మనుబోలు వైసీపీ నాయకులు
The bullet news (manubolu)_
మనుబోలు మండలంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ జయరామి రెడ్డి ఆధ్వర్యంలో మండలం లోని చెర్లోపల్లి ఇవాళ కార్యకర్తలు, నాయకుల మధ్య ఈ కార్యక్రమాన్ని బూత్ కన్వీనర్ రమణ కుమార్ రెడ్డి ప్రారంభించారు. నవరత్నాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చంద్రబాబు నాయుడి అవినీతిపై నాయకులు మండిపడుతున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబానికి భారీ స్పందన వస్తోందన్నారు.. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఉన్నారన్నారు.. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు.. జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి నాయకత్వంలో జగన్ సీఎం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి దాసరి మహేంద్ర వర్మ, నాయకులు ఇసనాక. శ్రీనివాసులు రెడ్డి, అశోక్, ప్రసాద్ రెడ్డి,రామశేషా రెడ్డి పాల్గొన్నారు
వైఎస్సార్ కుటుంబానికి అనూహ్య స్పందన- మనుబోలు వైసీపీ నాయకులు
Reviewed by ADMIN
on
September 29, 2017
Rating:
No comments: