సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెల్లూరు పొలిటికల్ లీడర్స్ వీరే..
The bullet News (Nellore)- సమస్య పరిష్కరానికైనా.. పబ్లిసిటికైనా.. తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాలన్నా అందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి ప్రసార సాధనం సోషల్ మీడియా.. పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ యాప్ ఏదైనా సరే వాటిల్లో యాక్టివ్ గా ఉండేవాళ్లే అందరికీ బాగా గుర్తుంటారు.. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల గురించి అయితే చెప్పనక్కర్లేదు. వారి కామెంట్స్ కోసం, ఫోటోస్ కోసం అభిమానులు ఎదరుచూస్తూ ఉంటారు. పార్టీ ప్రచారాల నుంచి వ్యక్తిగత ఫోటోలు వరకు ప్రతి ఒక్క ఫోటో కు లైక్ లమీద లైకులు వస్తుంటాయి.. ఇంతకీ నెల్లూరు జిల్లాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పార్టీ ఏది..? ఏ నాయకులు సోషల్ మీడియాను ఫాలో అవుతుంటారు..? ఇవన్నీ తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే..
ఒకరి గొప్పతనం తెలియజేయాలన్నా... మరొకరి చీకటి్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నా సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర.. సోషల్ మీడియాతో పబ్లిసిటి కి కొదువ లేదు.. వాడుకున్నోళ్లకి వాడుకున్నంత.. సోషల్ మీడియాలో ప్రచారం పొంది ఉన్నత శిఖరాలు అదిరోహించిన రాజకీయ నాయకులను సైతం మనం చూస్తూనే ఉన్నాం.. భారత ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియాను ఉపయోగించేంతగా ఎవ్వరూ ఉపయోగించరనే చెప్పొచ్చు.. 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాని అవ్వడానికి, బిజేపి విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం..
నెల్లూరుజిల్లా విషయానికొస్తే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎంలు కొద్దో గొప్పొ సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నాయి.. అధికార పార్టీ టీడీపీ కంటే వైసీపీనే ఈ విషయంలో కాస్తంత ముందుందని చెప్పొచ్చు.. ప్రజాప్రతినిదులు విషయానికొస్తే వైసీపీ నుంచి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిలు స్వయంగా పేస్ బుక్, వాట్సాప్ ను ఉపయోగిస్తూ తమ ప్రచార కార్యక్రమాలను పోస్ట్ చేస్తూ ఉంటారు.. టీడీపీ నుంచి నేరుగా పోస్ట్ చేసే నాయకులు లేరనే చెప్పాలి.. ఇక తమ అనుచరుల ద్వారా తమ కార్యక్రమాలను పోస్ట్ చేయించే నాయకుల్లో సైతం వైసీపీ నే ముందుంది..
సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు టీడీపీ నాయకులు గూటూరు కన్నబాబు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి సోమిరెడ్డి సైతం పోస్ట్ చేయిస్తూ ఉంటారు.. వారితో పాటు వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె అనుచరులు ఎప్పటికప్పుడు శారదా ప్రోగ్రామ్స్ వాట్సాప్ లో అప్ లోడ్ చేస్తూ అందరి కంటే ముందుంటారు.. మిగతా ఎమ్మెల్యేవ్వరూ సోషల్ మీడియాను ప్రచారం కోసం పెద్దగా వాడుకోరనే చెప్పుకోవాలి..
2019 ఎన్నికల్లో లోపు సోషల్ మీడియా ఇంకా వపర్ పుల్ కానుంది.. దీని ద్వారా వచ్చే పోస్టులను మాత్రమే యవత, ప్రజలు బాగా విశ్వసిస్తారు.. సో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే నాయకులదే భవిష్యత్...
ఒకరి గొప్పతనం తెలియజేయాలన్నా... మరొకరి చీకటి్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నా సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర.. సోషల్ మీడియాతో పబ్లిసిటి కి కొదువ లేదు.. వాడుకున్నోళ్లకి వాడుకున్నంత.. సోషల్ మీడియాలో ప్రచారం పొంది ఉన్నత శిఖరాలు అదిరోహించిన రాజకీయ నాయకులను సైతం మనం చూస్తూనే ఉన్నాం.. భారత ప్రధాని నరేంద్రమోడీ సోషల్ మీడియాను ఉపయోగించేంతగా ఎవ్వరూ ఉపయోగించరనే చెప్పొచ్చు.. 2014 ఎన్నికల్లో మోడీ ప్రధాని అవ్వడానికి, బిజేపి విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణం..
నెల్లూరుజిల్లా విషయానికొస్తే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఎంలు కొద్దో గొప్పొ సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నాయి.. అధికార పార్టీ టీడీపీ కంటే వైసీపీనే ఈ విషయంలో కాస్తంత ముందుందని చెప్పొచ్చు.. ప్రజాప్రతినిదులు విషయానికొస్తే వైసీపీ నుంచి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిలు స్వయంగా పేస్ బుక్, వాట్సాప్ ను ఉపయోగిస్తూ తమ ప్రచార కార్యక్రమాలను పోస్ట్ చేస్తూ ఉంటారు.. టీడీపీ నుంచి నేరుగా పోస్ట్ చేసే నాయకులు లేరనే చెప్పాలి.. ఇక తమ అనుచరుల ద్వారా తమ కార్యక్రమాలను పోస్ట్ చేయించే నాయకుల్లో సైతం వైసీపీ నే ముందుంది..
సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆత్మకూరు టీడీపీ నాయకులు గూటూరు కన్నబాబు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, యువనేత సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి సోమిరెడ్డి సైతం పోస్ట్ చేయిస్తూ ఉంటారు.. వారితో పాటు వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె అనుచరులు ఎప్పటికప్పుడు శారదా ప్రోగ్రామ్స్ వాట్సాప్ లో అప్ లోడ్ చేస్తూ అందరి కంటే ముందుంటారు.. మిగతా ఎమ్మెల్యేవ్వరూ సోషల్ మీడియాను ప్రచారం కోసం పెద్దగా వాడుకోరనే చెప్పుకోవాలి..
2019 ఎన్నికల్లో లోపు సోషల్ మీడియా ఇంకా వపర్ పుల్ కానుంది.. దీని ద్వారా వచ్చే పోస్టులను మాత్రమే యవత, ప్రజలు బాగా విశ్వసిస్తారు.. సో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే నాయకులదే భవిష్యత్...
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెల్లూరు పొలిటికల్ లీడర్స్ వీరే..
Reviewed by ADMIN
on
September 29, 2017
Rating:
No comments: