ఓ చిన్న స్పర్శ..లక్షల్లో రాబడి
The bullet news (Nellore)- ఓ స్పర్శ... రెండు వచ్చిరాని తెలుగు మాటలు.. అమాయక జనం.. వెరసి ఓ తమిళ తంబి లక్షలు సంపాదిస్తున్నాడు.. అక్చు పంక్చర్ పేరుతో అమాయ ప్రజలను మోసం చేస్తున్నాడు.. దాదాపు ఏడాదిన్నరగా నెల్లూరీయులను నిలువెల్లా మోసం చేస్తున్నాడు.. ఇంతకీ ఎవరా తమిళ తంబి..? ఏంటా వైద్యం..? వారానికి అతని ఆదాయమెంత..? ఇవన్నీ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ
మందుల్లేవు.. పరీక్షలూ లేవు.. చికిత్స అంతకన్నా లేదు.. అంతా మాటలతో మాయ.. చేతులతోనే స్పర్శ.. ఇది నెల్లూరులో ఓ నయా వైద్యుడి చికిత్సా విధానం.. ఆక్యు పంక్చర్ వైద్యం పేరుతో బోర్డు పెట్టిన ఓ తమిళనాడు వ్యక్తి నెల్లూరీయులను నిలువెల్లా మోసం చేస్తున్నాడు.. అమాయక ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాడు. చెన్నయ్ లోని తంజావూరుకు చెందిన ఎంగిల్స్ రాజా నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సమీపంలో ఆక్యుపంక్చర్ నిలయం పేరుతో ఓ వైద్యశాలను రన్ చేస్తున్నారు. ఈయన గారి స్పర్శ తగిలితే చాలు.. ఎంతటి రోగమైనా ఠక్కున మాయమైపోతుందట. ఇలా గత రెండేళ్లుగా నెల్లూరు ప్రజలు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ వస్తున్నాడు.. ఫీజుల పేరుతో లక్షల్లో దోచుకున్నాడు.. జనవిజ్ణాన వేదిక, ప్రజారోగ్య వేదిక రంగంలోకి దిగడంతో నయా వైద్యుడి నయవంచన బట్టబయలైంది.. ఆక్యుపంక్చర్ వైద్యం పేరుతో తమిళ తంబి నయా దందాకు తెరలేపారు.. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో వెనకేసుకున్నారు.. పెద్ద జబ్బులకు గురైన సామాన్య జనం ఆర్దిక ఇబ్బందులతో వైద్యశాలకు వెళ్లేలేని వారిని టార్గెట్ చేసి మరీ ఈ మాటల మాంత్రికుడు మానసిక వైద్యం చేస్తున్నాడు.
వారానికి రెండు నుంచి నాలుగు లక్ష రూపాయాల దాకా వసూలు చేస్తున్న ఈ నయా వైద్యుడు చేసే నకిలీ వైద్యం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.. రోగులకు ముకులిత హస్తాలతో నమస్కారం చేస్తూ వారి చేతులను స్పరిస్తూ ఇక జబ్బు బాగైంది పొమ్మంటూ వైద్యసలహా ఇస్తారు.. జనవిజ్ణాన వేదిక, ప్రజారోగ్య వేదిక చొరవతో వెలుగుచూసిన ఈ నయా వైద్యుడి బాగోతంతో పోలీసులు రంగంలోకి దిగారు.. అన్ని పరిశీలించిన కేసు నమోదు చేశారు.. ఆపై అరెస్టు చేసి కోర్టు హాజరు పరిచారు. దీంతో నయా వైద్యుడి హస్తలాఘవానికి అడ్డుకట్ట పడ్డింది.. ఇలాంటి వైద్యులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం ఇలాంటి వారి భరతం పట్టాలని జనవిజ్ణాన వేదిక నాయకులు కోరుతున్నారు..
మందుల్లేవు.. పరీక్షలూ లేవు.. చికిత్స అంతకన్నా లేదు.. అంతా మాటలతో మాయ.. చేతులతోనే స్పర్శ.. ఇది నెల్లూరులో ఓ నయా వైద్యుడి చికిత్సా విధానం.. ఆక్యు పంక్చర్ వైద్యం పేరుతో బోర్డు పెట్టిన ఓ తమిళనాడు వ్యక్తి నెల్లూరీయులను నిలువెల్లా మోసం చేస్తున్నాడు.. అమాయక ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాడు. చెన్నయ్ లోని తంజావూరుకు చెందిన ఎంగిల్స్ రాజా నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సమీపంలో ఆక్యుపంక్చర్ నిలయం పేరుతో ఓ వైద్యశాలను రన్ చేస్తున్నారు. ఈయన గారి స్పర్శ తగిలితే చాలు.. ఎంతటి రోగమైనా ఠక్కున మాయమైపోతుందట. ఇలా గత రెండేళ్లుగా నెల్లూరు ప్రజలు అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ వస్తున్నాడు.. ఫీజుల పేరుతో లక్షల్లో దోచుకున్నాడు.. జనవిజ్ణాన వేదిక, ప్రజారోగ్య వేదిక రంగంలోకి దిగడంతో నయా వైద్యుడి నయవంచన బట్టబయలైంది.. ఆక్యుపంక్చర్ వైద్యం పేరుతో తమిళ తంబి నయా దందాకు తెరలేపారు.. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల్లో వెనకేసుకున్నారు.. పెద్ద జబ్బులకు గురైన సామాన్య జనం ఆర్దిక ఇబ్బందులతో వైద్యశాలకు వెళ్లేలేని వారిని టార్గెట్ చేసి మరీ ఈ మాటల మాంత్రికుడు మానసిక వైద్యం చేస్తున్నాడు.
వారానికి రెండు నుంచి నాలుగు లక్ష రూపాయాల దాకా వసూలు చేస్తున్న ఈ నయా వైద్యుడు చేసే నకిలీ వైద్యం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.. రోగులకు ముకులిత హస్తాలతో నమస్కారం చేస్తూ వారి చేతులను స్పరిస్తూ ఇక జబ్బు బాగైంది పొమ్మంటూ వైద్యసలహా ఇస్తారు.. జనవిజ్ణాన వేదిక, ప్రజారోగ్య వేదిక చొరవతో వెలుగుచూసిన ఈ నయా వైద్యుడి బాగోతంతో పోలీసులు రంగంలోకి దిగారు.. అన్ని పరిశీలించిన కేసు నమోదు చేశారు.. ఆపై అరెస్టు చేసి కోర్టు హాజరు పరిచారు. దీంతో నయా వైద్యుడి హస్తలాఘవానికి అడ్డుకట్ట పడ్డింది.. ఇలాంటి వైద్యులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సైతం ఇలాంటి వారి భరతం పట్టాలని జనవిజ్ణాన వేదిక నాయకులు కోరుతున్నారు..
ఓ చిన్న స్పర్శ..లక్షల్లో రాబడి
Reviewed by ADMIN
on
September 29, 2017
Rating:
No comments: