ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో నెల్లూరు టీమ్ గ్రాండ్ విక్టరీ
The bullet news (Ananthapuram)- నరాలు తెగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో నెల్లూరు జట్టు ఘన విజయం సాధించింది. అనంతపురంలో జరుగుతున్న జర్నలిస్ట్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో నెల్లూరు టీమ్ తన మొదటి మ్యాచ్ లో గ్రాండ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.. నాలుగు వికెట్ల తేడాతో అనంతపురం అర్బన్ జట్టుపై విజయం సాధించింది.. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 160 పరుగులు సాధించింది.. జనార్దన్ రెండు వికెట్స్, అంద్రభూమి అబ్దుల్లా 2, మణికంఠ ఒక్క వికెట్ తీసి అనంతపురం నడ్డి విరిచారు.. వీరి పదునైన బంతులకు తోడు రాజ్ టీవీ స్టాప్ కెమెరామెన్ మూర్తి, ఫోటోగ్రాఫర్ కోదండపాణి పీల్డింగ్ లో అత్యత్తుమ ప్రదర్శన కనబరచడంతో ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్ కు కట్టడి చేయగలిగారు.. 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు టీమ్ కు ఓపెనర్లు ఆఖిల్ (15), అస్లామ్ (38) శుభారంభాన్నిచ్చారు.. మొదటి వికెట్ గా ఆఖిల్ వెనుదిరడంతో జనార్దన్, అస్లామ్ జోడి విజయం దిశగా జట్టును నడిపించారు. ఈ సమయంలో రెండు కీలక వికెట్లు పడటంతో నెల్లూరు జట్టు పరుగుల వేగం నెమ్మదించింది. 14 బంతుల్లో 19 రన్స్ కొట్టాల్సిన సమయంలో దూకుడుగా ఆడుతున్న కోటి అవుటవ్వడంతో మ్యాచ్ చేజారిపోయిందని అందరూ భావించారు. కానీ అబ్దుల్లా విజృంభణతో చివరిలో ఓవర్ లో తొమ్మిది పరుగులు చేసి జట్టుకు విజయానందించారు.. క్లిష్టమైన పరిస్థితిలో ఫోర్ కొట్టి మ్యాచ్ గెలిపించడంలో అబ్దుల్లా మంచి పోరాట పటిమ ప్రదర్శించారు.. నెల్లూరు తదుపరి మ్యాచ్ పశ్చిమ గోదావరితో రేపు ఆడనుంది..
ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో నెల్లూరు టీమ్ గ్రాండ్ విక్టరీ
Reviewed by ADMIN
on
September 23, 2017
Rating:
No comments: