రొట్టె పట్టగా కోరిక తీరగా...
The bullet news (Nellore)- కుల మతాలకు అతీతంగా నెల్లూరులో జరుపుకునే రొట్టెల పండుగకు రెండో రోజు కూడా భక్తులు పోటెత్తారు.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పండుగకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామునుంచే భక్తుల దర్గాకు క్యూ కట్టారు. వివాహ, సంతాన, సౌభాగ్య రొట్టెల కోసం భక్తులు పోటీ పడ్డారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది.. దాదాపు 1800 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసుల పహారా ఉండటంతో రొట్టెల పండుగ ప్రశాంతంగా జరుగుతోంది.. డ్రోన్ కెమోరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.. తప్పిన పిల్లలు, పెద్దల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.. మరోపక్క నెల్లూరులో ట్రాఫిక్ స్థంభించింది.. కెవిఆర్, ఆర్టీసీ విఆర్సీ, ఆత్మకూరు బస్టాండ్ర, ముత్తుకూరు గేట్, రామలింగాపురం, ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటేనే నరకం కనిపిస్తోంది.. గంటల కొద్ది పడిగాపులు, కిలోమీటర్ల కొద్ది క్యూ దర్శనమిస్తున్నాయి.. దేశవిదేశాల నుంచి భక్తులు రావడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. అందరూ అధికారుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి..
రొట్టె పట్టగా కోరిక తీరగా...
Reviewed by ADMIN
on
October 02, 2017
Rating:
No comments: