Top Ad unit 728 × 90

మంత్రి పత్తిపాటి పుల్లారావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రావెల

THE BULLET NEWS (GUNTUR)-రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బుధవారం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా నియోజకవర్గంలో విచ్చలవిడిగా మైనింగ్ ఏర్పాటు చేసి ఇప్పటివరకు దాదాపు రూ. 100కోట్ల మట్టిని తరలించారని ఆయన ఆరోపించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుచెప్పి అశోక్ బృందం మైనింగ్ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. అంతేగాక మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు కుమారుడు అనిల్ కూడా అక్రమంగా మైనింగ్ నిర్వహించారని, ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయని రావెల అన్నారు.
అసలు నా నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నేతల జోక్యం ఏమిటో అర్ధంగావడం లేదన్నారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాల్సిన మైనింగ్ , రెవిన్యూ, పోలీస్ అధికారులు లంచాలకు లొంగిపోయారని ఆరోపించారు. అలాగే కొంతమంది దుర్బుద్ది వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
మంత్రి పత్తిపాటి పుల్లారావు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రావెల Reviewed by ADMIN on February 28, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.