నీళ్లల్లో కాదు.. రోడ్డు మీద చేపలు...
THE BULLET NEWS (KOVUR)- ఒకటి కాదు.. రెండు కాదు.. టన్నుల కొద్ది చేపలు రోడ్డు పాలయ్యాయి..లక్షల విలువ చేసే మత్య్ససంపద నేలపాలైంది.. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు రామన్నపాలెం గేట్ సమీపంలో చోటు చేసుకుంది.. చేపల రవాణా చేసే వ్యాన్ బోల్తా కొట్టింది.. ఈ ప్రమాదంలో దాదాపు 2 టన్నుల చేపలు రోడ్డుపాలయ్యాయి.. మచిలీపట్నం నుంచి తిరుచి వెళ్తున్న వ్యాన్ రామన్నపాలెం గేట్ వద్దకు రాగానే హఠాత్తుగా టైర్ పగిలిపోయింది.. దీంతొ ఒక్కసారిగా వ్యాన్ బోల్తా కొ్ట్టడంతో చేపలు రోడ్డుపాలయ్యాయి.. ఎలాంటి ప్రాణప్రాయం లేదు. ఈ ప్రమాదంతో హైవే పై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు నియంత్రించారు.. సమాచారం అందుకున్న కోవూరు, హై వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
నీళ్లల్లో కాదు.. రోడ్డు మీద చేపలు...
Reviewed by ADMIN
on
February 26, 2018
Rating:
No comments: