Top Ad unit 728 × 90

జగన్ యాత్ర @120రోజులు

THE BULLET NEWS (GUNTUR)-అశేష  ప్రజానీకం అండతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 120వ రోజుకి చేరుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు.

ఇక నేటి యాత్ర బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం మీదుగా ములకలూరు చేరుకుంటుంది. అక్కడ పార్టీ జెండాను వైఎస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారు. ఆపై మధ్యాహ్న భోజన విరామం తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గొల్లపాడు నుంచి ముప్పళ్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.

దారి పొడవునా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు వింటూ ముందుకు సాగుతారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ 1, 586 కిలోమీటర్లు నడిచారు.
జగన్ యాత్ర @120రోజులు Reviewed by ADMIN on March 25, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.