8792 ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ : మంత్రి కడియం
THE BULLET NEWS (HYDERABAD)-టీఎస్ పీఎస్సీ ఎంపికల ద్వారా ప్రభుత్వం, స్థానిక సంస్థల పాఠశాలల్లో 8792 ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. టీశాసనమండలిలో కడియం మాట్లాడారు. పుస్తకాలు, పోస్టర్లు వంటి విషయాలపై మరింత అవగాహన కల్పిస్తామని చెప్పారు. అభ్యాసన ఫలితాలను క్రమం తప్పకుండా మదింపు చేయడానికి జాతీయ సాఫల్యత సర్వే నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ బోధనలు పటిష్టపరుస్తామని చెప్పారు. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కుల్స్, కేజీబీవీలలో లభ్యంగా ఉన్న మౌళిక సదుపాయలను మెరుగు పర్చుతామని తెలిపారు.
8792 ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ : మంత్రి కడియం
Reviewed by ADMIN
on
March 25, 2018
Rating:
No comments: