Top Ad unit 728 × 90

డిసెంబరు నాటికి భూగర్భ డ్రైను పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షణ..- నగర మేయర్ అబ్దుల్ అజీజ్

THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు మహానగర నిర్మాణంలో భాగంగా నగరవ్యాప్తంగా జరుగుతున్నభూగర్భ డ్రైను అభివృద్ధి పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామనీ మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక రూరల్ మండలం  అల్లీపురంలో నిర్మాణం జరుగుతున్న మురుగునీటి శుద్ధికేంద్రం (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ : ఎస్టీపీ) పనులను మేయరు శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.580 కోట్ల నిధులతో నగర వ్యాప్తంగా జరుగుతున్న భూగర్భ డ్రైను నిర్మాణ పనుల్లో భాగంగా 5 ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణం జరుతున్నాయని వివరించారు. రూ.48 కోట్లతో నిర్మాణమవుతున్న అల్లీపురం కేంద్రంనుంచి శుద్ధి చేసిన 550 లక్షల లీటర్ల మంచినీటిని వ్యవసాయ రంగానికి ప్రతిరోజూ సరఫరా చేస్తామని ప్రకటించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాలపై ప్రజల్లో ఉన్న అపోహలన్నీ అవాస్తవాలనీ, అత్యాధునికమైన సాంకేతికతో పనిచేస్తున్న ఈ కేంద్రాల్లో దుర్గంధానికి ఏమాత్రం అవకాశంలేదని మేయరు స్పష్టం చేసారు. జనార్ధన్ రెడ్డి కాలనీ కేంద్రం ద్వారా 5 ఎంఎల్ డీ, అల్లీపురం కేంద్రం ద్వారా 55 ఎంఎల్ డీ, కొండాయ పాళెం కేంద్రం ద్వారా 14 ఎంఎల్ డీ, డ్రైవర్సు కాలనీ కేంద్రం ద్వారా 11 ఎంఎల్ డీ, హెడ్ వాటర్ వర్క్సు కేంద్రం నుంచి 20 ఎంఎల్ డీ శుద్ధి చేసిన పది కోట్లా యాభై లక్షల లీటర్ల నీటిని జిల్లాలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక అవసరాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని మేయరు వివరించారు. నగర వ్యాప్తంగా 440 కిలోమీటర్ల మేర జరుగుతున్న భూగర్భ డ్రైను, మంచి నీటి పైపు లైన్ల నిర్మాణ పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయనీ,  ఈ ఏడాది డిసెంబరు నాటికి కచ్చితంగా పూర్తిచేస్తామని మేయరు స్పష్టం చేశారు..
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండిన వెంకయ్యనాయుడు, మున్సిపల్ శాఖా మంత్రి  నారాయణల బృహత్తర ఆలోచనలూ, సహకారంతోనే నగరాభివృద్ధి సాధ్యమవుతోందని మేయరు స్పష్టం చేసారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, కార్పొరేటర్లు పెంచలనాయుడు, ప్రశాంత్ కుమార్, పొత్తూరి శైలజ, మేకల రామమూర్తి, నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, జాకీర్, జహీర్, షంషుద్దీన్, జమీర్, మౌలానా, ఓం ప్రకాష్ యాదవ్, జంషీద్, సాబీర్ ఖాన్, సయ్యద్ ఇక్బాల్, పాషా మొహిద్దీన్, సుభహాన్, కార్పోరేషను అధికారులు మోహన్, దేవికా, ఎల్ & టి నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు
డిసెంబరు నాటికి భూగర్భ డ్రైను పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షణ..- నగర మేయర్ అబ్దుల్ అజీజ్ Reviewed by ADMIN on March 24, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.