తమ ప్రభుత్వం రాగానే బీదా అవినీతిపై విచారణ - కావలి ఎమ్మెల్యే ప్రతాప్
The bullet news (Nellore)- రింగ్ మాష్టర్ ఎమ్మెల్సీ బీదారవిచంద్ర అధికారాన్ని అడ్డుపెట్టుకుని 400 కోట్ల రూపాయాలు దోచుకున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన బీదా రవిచంద్ర అక్రమాలకు అడ్డూ అదుపూ లేదన్నారు.. అధికారుల బదిలీల్లో సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. బీదా మస్తాన్ రావు కు రాస్యసభ రాకుండా ఎమ్మెల్సీ తెచ్చుకున్నాడని ఆరోపించారు.. కావలిలో తనపై పోటీ చేసి గెలవాలని ఆయన డిమాండ్ చేశారు.. తమ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ బీదా అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన హెచ్చరించారు..
తమ ప్రభుత్వం రాగానే బీదా అవినీతిపై విచారణ - కావలి ఎమ్మెల్యే ప్రతాప్
Reviewed by ADMIN
on
April 01, 2018
Rating:
No comments: