విజయమాల్యను చంద్రబాబు కలిశారు లేదా.. సీఎం సమాధానం చెప్పాలి..- బిజిపి రాష్ట కార్యదర్శి డిమాండ్
THE BULLET NEWS (NELLORE)-టిడిపి పై బిజిపి నాయకులు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.. చంద్రబాబు నాయుడే టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.. స్వప్రయోజనాల కోసమే సీఎం ఢిల్లీ యాత్ర అని బీజేపీ రాష్ట కార్యదర్శి కోటీశ్వరరావు మండిపడ్డారు. బిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన టిడిపి పై మండిపడ్డారు.. కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకున్నారని ఆయన విమర్శించారు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునేలా ఉందన్నారు. గజదొంగ విజయ మాల్యాను చంద్రబాబు లండన్ లో కలిసి పార్టీ ఫండ్ 150 కోట్లు తీసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల పై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. దీనిపై నేరుగా చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు..
విజయమాల్యను చంద్రబాబు కలిశారు లేదా.. సీఎం సమాధానం చెప్పాలి..- బిజిపి రాష్ట కార్యదర్శి డిమాండ్
Reviewed by ADMIN
on
April 03, 2018
Rating:
No comments: