ఆల్ ది బెస్ట్...
THE BULLET NEWS-ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇందుకోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో ఇవాల్టి నుంచి నుంచి మార్చి 19 వరకు,.. తెలంగాణలో మార్చి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్ధులు పదిహేను నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఏపీలో విద్యార్ధుల పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను విడుదల చేశారు. మొబైల్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే పరీక్ష కేంద్రం రూట్మ్యాప్ వస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... పరీక్షలు సక్రమంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆల్ ది బెస్ట్...
Reviewed by ADMIN
on
February 28, 2018
Rating:
No comments: