నెల్లూరు నగరంలో 47వార్డ్ సచివాలయంలో ఆపద్బాంధవరాలు
నెల్లూరు నగరంలోని ఓ సచివాలయ చిరుఉద్యోగిని ఆ వార్డు ప్రజల మన్ననలు అందుకుంటుంది. ఆ కాలనీవాసులకు వెన్నుంటూ ఉండి ఏ కష్టమొచ్చిన తనకష్టముగా భావుంచి పరిష్కార మార్గం చూపుతుంది .అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ముందుటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది.ఆమే ఎవరో ఆమే ఎక్కడ పని చేస్తుందో కాస్త తెలుసుకుందాం
నగరంలోని 47వ వార్డులో పనిచేస్తున్న లక్ష్మీ అనే ఓ సచివాలయ ఉద్యోగి (వార్డ్ వెల్ ఫేర్) పని చేస్తుంది. కాలనీవాసులు ఆమెను మెచ్చుకోకతప్పడంలేదు.ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో శరవేగంగా చేస్తూ వృధ్ధులకు తన సొంత బిడ్డలా నడుచుకుంటూ మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.రెండు రోజుల నుండి జరుగుతున్నా వైఎస్ఆర్ పింఛన్లు కార్యక్రమంలో ఇంటింటా పింఛన్లు పంపిణి చేస్తూ నేను ఉన్నాను అంటూ దూసుకొని వెళ్తుంది .వృధ్ధులకు , వితంతువులకు , అభాగ్యులకు ఆసరాగా నిలబడి శభాష్ అనిపించుకుంటింది
No comments: