మేముంటాం నీకు అండగా...వేధింపులకు గురుతున్న బాధితురాలికి అండగా మహిళా పోలీసులు...
సీఎం జగన్ ఆలోచనలకు ప్రతి రూపాలే సచివాలయాలు.. అలాంటి సచివాలయాలు క్షేత్రస్థాయిలో అందరికి ఉపయోగపడుతున్నాయి..
మహిళ భద్రత కోసం ఏర్పాటు నియమించిన మహిళా పోలీసులు క్షేత్రస్థాయిలో చక్కగా పని చేస్తున్నారు.. ఇంటా, బయట వేధింపులకు గురవుతున్న వారికి అండగా నిలబడుతున్నారు..అత్తమామలు, భర్త వేధిస్తున్నారంటూ రాజేంద్రనగర్ కు చెందిన ఓ మహిళ 47 వ డివిజన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు పిర్యాదు చేసింది..దీంతో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు.. బాధితురాలి సమస్యను సంతపేట సిఐ దృష్టికి తీసుకెళ్లారు.. స్పందించిన సిఐ కేసు నమోదు చేసి బాధిత మహిళకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితురాలి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన మహిళా పోలీసులు రాపురు పద్మ, సువార్త వాణి, ఉదయగిరి మౌనికలను ఆయన అభినందించారు.
మేముంటాం నీకు అండగా...వేధింపులకు గురుతున్న బాధితురాలికి అండగా మహిళా పోలీసులు...
Reviewed by ADMIN
on
March 05, 2020
Rating:
No comments: